ఇంత బతుకు బతికి ఇలాంటి పరిస్థితా.. అధిష్టానం పిలిస్తేనే వచ్చా: జగ్గారెడ్డి

by Disha Web Desk 12 |
ఇంత బతుకు బతికి ఇలాంటి పరిస్థితా.. అధిష్టానం పిలిస్తేనే వచ్చా: జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నుంచి వరుస చేరికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నాయకులందరినీ ఢిల్లీకి పిలిచారు. పొంగులేటి, జూపల్లి సహా చాలా మంది కాంగ్రెస్ లో చేరికపై క్లారీటి రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ నేడు స్ట్రాటజీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అయితే స్ట్రాటజీ మాట దేవుడేరుగును గాని కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ వార్‌కు, సవాళ్లకు ఈ మీటింగ్ వేదిక కానున్నట్లు తెలుస్తుంది.

దీనిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఇంత బతుకు బతికి ఇలాంటి పరిస్థితా అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను హైకమాండ్ పిలిస్తేనే వచ్చానని.. వారికి అన్ని చెబుతానని జగ్గారెడ్డి అన్నారు. ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని.. ఎక్కడ లాలూచీ పడకుండా.. ఉన్నది ఉన్నట్లు అధిష్టానానికి వివరిస్తానన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వేరు.. హైకమాండ్ ఊహిస్తోంది వేరని.. జగ్గారెడ్డి అన్నారు.

Read More..

ఇక అందరి దృష్టి ఈటలపైనే.. ఇవాళ మీడియా ముందుకు భార్య జమున!

Next Story