ఏపీలో మళ్లీ జగనే.. KCR కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్

by Disha Web Desk 4 |
ఏపీలో మళ్లీ జగనే.. KCR కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం మంగళవారం ఓ టీవీ ఛానెల్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తమకున్న సమాచారం ప్రకారం ఏపీలో మళ్లీ జగన్ గెలవబోతున్నాడని కామెంట్ చేశారు. ఇక, ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు మండిపడ్డారు. తాజాగా నెట్టింట కేసీఆర్ కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘అప్పట్లో వెలమ దొర.. ఇప్పుడు కోయ దొర ఒక సిలకను పెట్టుకుని జోష్యం చెప్పుకో దొర..’ అంటూ కౌంటర్ కామెంట్స్ పెడుతున్నారు. ‘నీ పార్టీ ఓటమి రిపోర్ట్స్ నీకు తెలియదు.. పక్క రాష్ట్రాల సమాచారం అంటా..’ అని ఫైర్ అవుతున్నారు.

‘ఆంధ్రా వాళ్లను ఒకప్పుడు నోటికి వచ్చినట్టు దూషించిన కేసీఆర్ కూడా ఇంకా జగనే రావాలి అనుకుంటున్నాడు అంటే ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలి కదా,, తెలంగాణలో స్వేచ్ఛ కోసం కేసీఆర్ ని వదిలించుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు జగన్ వదిలించుకొనే విషయంలో అని తెలియజేసిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు’ అంటూ నెట్టింట ఆడుకుంటున్నారు. ‘మాకున్న సమాచారం మీరు చంచల్ గూడ ,జగన్ తీహార్ జైలు ఎన్నికల తర్వాత’ అంటూ విరుచుకుపడుతున్నారు.

Read More : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్



Next Story

Most Viewed