కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఉత్తర్వులు జారీ చేయండి

by velandi.Saikiran |

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయండని చీఫ్​సెక్రటరీ

కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఉత్తర్వులు జారీ చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయండని చీఫ్​సెక్రటరీ రామకృష్ణారావును బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాయలంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ ఎంప్లాయిస్​జేఏసీ సెక్రటరీ జనరల్​ఏలూరి శ్రీనివాస్ రావు ఆధ్వర్వంలో పలువురు ఉద్యోగులు సీఎస్​ను కలిసి ఉద్యోగుల దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు.


అలాగే క్యాబినెట్ సబ్​కమిటీ , ఆఫీసర్స్ సబ్ కమిటీ లను నియమించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నందుకు తెలంగాణా ఉద్యోగుల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. కాగా క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని ఉద్యోగుల జేఏసీ చేసిన విజ్ఞప్తికి చీఫ్​ సెక్రటరీ రామకృష్ణారావు సానుకూలంగా స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమములో టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామారావు, లక్ష్మణ్ గౌడ్ , మోహన్, శ్రీరామ్ రెడ్డి, షౌకత్, శ్రీరామ్, సత్తయ్య, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story