టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ముగింపు దశకు సిట్​ విచారణ..!

by Disha Web Desk 13 |
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ముగింపు దశకు సిట్​ విచారణ..!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్​ విచారణ దాదాపుగా ముగింపు దశకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరో వారం రోజుల్లో సిట్​ అధికారులు విచారణలో వెల్లడైన అంశాలతో సమగ్ర నివేదికను తయారు చేసి కోర్టుకు సమర్పించనున్నట్టు సమాచారం. కాగా, ప్రశ్నాపత్రాల లీకేజీపై ఎఫ్​ఐఆర్​జారీ చేసిన ఎన్​ఫోర్స్​మెంట్​డైరెక్టరేట్​అధికారులు నేటి నుంచి విచారణ ప్రారంభించనున్నట్టుగా తెలియవచ్చింది. బిల్డింగ్​టౌన్​ప్లానింగ్​ఓవర్సీస్​పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్టుగా అనుమానాలు రావటంతో గత నెల 11న బోర్డులో అసిస్టెంట్​సెక్రటరీగా పనిచేస్తున్న ఎస్.సత్యనారాయణ బేగంబజార్​పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై కేసులు నమోదు చేసిన బేగంబజార్​పోలీసులు సెంట్రల్​జోన్​టాస్క్ ఫోర్స్​పోలీసులతో కలిసి దర్యాప్తు జరుపగా ఏఈఈ సివిల్, జనరల్​స్టడీస్​పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైనట్టుగా వెల్లడైంది. బోర్డులో అసిస్టెంట్​సెక్షన్​ఆఫీసర్​హోదాలో సెక్రటరీ అనితా రాంచంద్రన్​పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ ఔట్​సోర్సింగ్​పై డేటా ఎంట్రీ ఆపరేటర్​గా పనిచేస్తున్న రాజశేఖర్​రెడ్డితో కలిసి ఈ ప్రశ్నాపత్రాలను తస్కరించినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ప్రశ్నాపత్రాలను దొంగిలించినట్టు ఒప్పుకున్కన్నారు.

కాన్ఫిడెన్షియల్​రూం ఇంఛార్జీగా ఉన్న శంకర్​లక్ష్మి డైరీ నుంచి కంప్యూటర్​కు సంబంధించిన పాస్​వర్డులు, ఐపీ అడ్రస్​లు సంగ్రహించి రాజశేఖర్​రెడ్డికి ఇచ్చినట్టు ప్రవీణ్​విచారణలో వెల్లడించాడు. వీటి సహాయంతో రాజశేఖర్​రెడ్డి కంప్యూటర్​నుంచి ప్రశ్నాపత్రాలను పెన్​డ్రైవ్​లోకి డౌన్​లోడ్​చేసి ఇచ్చినట్టు చెప్పాడు. వీటిని తాను మూడేళ్లుగా పరిచయం ఉన్న గురుకుల టీచర్​రేణుకకు పది లక్షల రూపాయలకు తీసుకుని ఇచ్చినట్టు వెల్లడించాడు.

ఈ క్రమంలో పోలీసులు రేణుకను కూడా అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రాలను తన భర్త లద్యావత్​డాక్యాకు ఇచ్చినట్టుగా ఆమె చెప్పటంతో అతన్ని కూడా కటకటాల వెనక్కి పంపించారు. ఆ తరువాత నిందితులను జరిపిన దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకు ప్రశాంత్, రాజశేఖర్​రెడ్డి, రేణుక, డాక్యాలతోపాటు మొత్తం పదిహేనుమందిని ఈ కేసులో దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు ప్రశ్నాపత్రాలు కొన్నవారు ఉన్నారు.

గ్రూప్​1 ప్రిలిమ్స్ ​ప్రశ్నాపత్రం కూడా..

అరెస్టు చేసిన ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డిలను నిశితంగా జరిపిన విచారణలో ఈ ఇద్దరు కలిసి గత సంవత్సరం అక్టోబరులో జరిగిన గ్రూప్​1 ప్రిలిమ్స్​పరీక్ష ప్రశ్నాపత్రాన్ని కూడా బోర్డు నుంచి తస్కరించినట్టుగా వెల్లడైంది. ఈ పరిణామం తీవ్ర కలకలం సృష్టించింది. గ్రూప్​1 ప్రిలిమ్స్​ప్రశ్నాపత్రం లీకైనట్టుగా సిట్​అధికారులు నివేదిక ఇవ్వటం, ఆ వెంటనే ఈ పరీక్షతోపాటు నిర్వహించాల్సి ఉన్న మరికొన్ని పరీక్షలను బోర్డు రద్దు చేయటం వెంటవెంటనే జరిగిపోయాయి. కాగా, విచారణలో గ్రూప్​1 ప్రిలిమ్స్​పరీక్ష ప్రశ్నాపత్రం ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి, బోర్డు ఉద్యోగులైన షమీమ్, రమేశ్​తోపాటు మాజీ ఉద్యోగి సురేష్​కు మాత్రమే అందినట్టుగా సిట్​విచారణలో నిర్ధారణ అయ్యింది.

న్యూజీలాండ్​లో ఉంటున్న రాజశేఖర్​రెడ్డి బావ ప్రశాంత్​రెడ్డి ఇక్కడికి వచ్చి గ్రూప్​1 ప్రిలిమ్స్​పరీక్ష రాసినట్టుగా తేలింది. ఈ అయిదుగురికి తప్పితే ఈ ప్రశ్నాపత్రం బయటివారెవ్వరికీ లీక్​కాలేదని స్పష్టమైంది. కాగా, బోర్డులో పరీక్షల ప్రశ్నాపత్రాల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఛైర్మన్​సంరక్షణలో ఉండాల్సిన కంప్యూటర్​ఉండే కాన్ఫిడెన్షియల్​రూం ఇంఛార్జీ బాధ్యతలను శంకర్​లక్ష్మికి ఎలా అప్పగించారు? సెక్రటరీ వద్ద పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్, బోర్డు సభ్యుడు లింగారెడ్డి వద్ద పనిచేస్తున్న రాజశేఖర్​రెడ్డి కంప్యూటర్లను హ్యాక్​చేసి ప్రశ్నాపత్రాలను తస్కరించినా ఎందుకు గుర్తించలేకపోయారు? అన్న అంశాలపై సిట్​అధికారులు తాజాగా అనితా రాంచంద్రన్, లింగారెడ్డి నుంచి సేకరించారు.

దర్యాప్తులో పాలు పంచుకుంటున్న ఓ అధికారితో మాట్లాడగా లీకేజీ కేసులో విచారణ దాదాపుగా ముగింపు దశకు చేరుకుందని చెప్పారు. ఏఈఈ సివిల్, జనరల్​నాలెడ్జ్​పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలే బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని, గ్రూప్​1 ప్రిలిమ్స్​పరీక్ష ప్రశ్నాపత్రం వెళ్లలేదని నిర్ధారణ అయ్యిందన్నారు. బోర్డు ఛైర్మన్​తోపాటు ఇతర సభ్యుల నుంచి కూడా మరింత సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. ఈ అన్ని అంశాలతో నివేదికను రూపొందించి సీల్డ్​కవర్​లో న్యాయస్థానానికి ఇవ్వనున్నట్టు చెప్పారు.

విచారణ మొదలు పెట్టనున్న ఈడీ..

ఇదిలా ఉండగా టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలో పెద్దమొత్తాల్లో డబ్బులు చేతులు మారినట్టుగా ముందు నుంచి అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ఇదే విషయాన్ని పేర్కొంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఇటీవల ఈడీ అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. ఈ స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టుగా అందులో పేర్కొన్నారు. దీంట్లో మనీలాండరింగ్​చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఈడీ అధికారులను కోరారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఈడీ అధికారులు ప్రశ్నాపత్రాల లీకేజీపై ఎఫ్​ఐఆర్​జారీ చేశారు. అయితే, శని, ఆదివారాలు సెలవు కావటంతో విచారణను ప్రారంభించలేదు.

నేడు సిట్​కార్యాలయానికి వెళ్లి ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో వెల్లడైన అన్ని వివరాలను ఈడీ అధికారులు తీసుకోనున్నట్టు సమాచారం. ఆ తరువాత కేసు దర్యాప్తును ముమ్మరం చేయనున్నట్టు తెలిసింది. దీనిపై సిట్​వర్గాలతో మాట్లాడగా మా విచారణలో తేలిన అంశాలతో కోర్టుకు నివేదిక ఇస్తామని చెప్పాయి. ఈడీ దర్యాప్తు సెపరేట్​గా జరుగుతుందని తెలిపాయి. వాళ్ల దర్యాప్తులో వెల్లడైన వివరాలతో వాళ్లు రిపోర్టును సిద్ధం చేసి కోర్టుకు ఇస్తారని వివరించాయి.


Next Story

Most Viewed