షర్మిల వియ్యంకురాలికి షాక్.. చట్నీస్ హోటల్‌లో ఐటీ రెయిడ్స్!

by Disha Web Desk 13 |
షర్మిల వియ్యంకురాలికి షాక్.. చట్నీస్ హోటల్‌లో ఐటీ రెయిడ్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్ లోని చట్నీస్ హోటల్ కు ఇన్ కమ్ టాక్స్ అధికారులు షాకిచ్చారు. మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థకు సంబంధించిన బ్రాంచీల్లో ఐటీ రెయిడ్స్ నిర్వహిస్తున్నారు.సంస్థ యజమాని అట్లూరి పద్మ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. కాగా చట్నీస్ సంస్థ యజమాని అట్లూరి పద్మ ఏపీ పీపీసీ చీఫ్ షర్మిరలకు వియ్యంకురాలు. షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి కూమార్తె ప్రియకు గత నెల 17న వివాహం జరిగింది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్ ఈటరీస్ లోనూ అడీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచరం. ఈ తనిఖీలకు సంబంధించి హోటళ్ల యజమానులతో పాటు ఐటీ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.


Next Story