ఒక్క రోజు మురిపమేనా? కాళేశ్వరం నీళ్లు వదిలారని ప్రచారం!

by Disha Web Desk 14 |
ఒక్క రోజు మురిపమేనా? కాళేశ్వరం నీళ్లు వదిలారని ప్రచారం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చి కాళేశ్వరం జలాలు విడుదల చేసిందని తాజాగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. కరీంనగర్ ఎస్సారెస్పీ వరద కాల్వలోకి జాలల పంపింగ్ చేశారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. రైతులను పరామర్శించేందుకు గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యాటనకు వెళ్తున్నారని చెప్పిన కొద్దిసేపటికే ఆదివారం నీరు వదిలారని, తర్వాత నీటిని అధికారులు ఆపేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే బయ్యన్న వాగు ఎస్ఆర్ఎస్పీ డీబీఎం 71 నీళ్లు వదిలి మళ్లీ నిన్నటి నుంచి అధికారులు నిలిపి వేశారని బయ్యన్న వాగు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్క రోజు మురిపానికే నీళ్లు వాదిలారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Next Story

Most Viewed