సూర్యాపేట జిల్లాలో వినూత్నంగా సాగునీటి దినోత్సవం.. లక్ష మందితో..

by Disha Web Desk 4 |
సూర్యాపేట జిల్లాలో వినూత్నంగా సాగునీటి దినోత్సవం.. లక్ష మందితో..
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో సాగునీటి దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాళేశ్వరం జలాలకు లక్ష జలహారతి పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొననున్నారు. లక్ష జన హారతికి 126 గ్రామాల రైతులు, యువకులు తరలివస్తున్నారు. కాళేశ్వరం నీరు పారుతున్న 68 కి.మీ. మేర కాలువ గట్ల మీదే వంటా వార్పు కార్యక్రమం నిర్వహించనున్నారు. నాగారం మండలం ఈటూరు నుంచి పెన్ పహాడ్ మండలం రావిపాడు వరకు జనహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. జాజిరెడ్డి గూడెం, ఆత్మకూరు, చివ్వెంల, పెన్ పహాడ్, మోతె మండలాల్లో జల హారతి నిర్వహించనున్నారు.


Next Story

Most Viewed