త్వరలోనే ధరణిపై మధ్యంతర నివేదిక.. పొంగులేటితో దరణి కమిటీ

by Disha Web Desk 5 |
త్వరలోనే ధరణిపై మధ్యంతర నివేదిక.. పొంగులేటితో దరణి కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇవ్వాళ సచివాలయంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తో ధరణి కమిటీ భేటీ అయ్యింది. నిన్న జరిగిన భేటీలో ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారాల కోసం ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ధరణి కమిటీ చెప్పింది. ఈ నేపధ్యంలో మధ్యంతర ఉత్తర్వులపై రెవెన్యూ శాఖ మంత్రితో కమిటీ సభ్యులు చర్చలు జరిపారు.

రేపు సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు మరో రెండు జిల్లాల కలెక్టర్లతో కలిపి, మొత్తం నాలుగు జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏ కార్యాలయంలో ధరణి కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో భూ సమస్యలపై కమిటీ చర్చించుకొని, అలాగే ధరణి వల్ల రైతులు పడ్డ ఇబ్బందులపై ఆరా తీయనుంది. ఈ భేటీ అనంతరం రెవెన్యూ శాఖ మంత్రికి పూర్తి స్తాయి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సీఎం రేవంత్ రెడ్డి తో చర్చ జరపనున్నట్లు తెలుస్తొంది.

Read More..

డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు పై విచారణ షురూ : కలెక్టర్



Next Story

Most Viewed