ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. 9 మంది సూసైడ్!

by Disha Web Desk 9 |
ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. 9 మంది సూసైడ్!
X

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణలో మే 9(నిన్న)న విడుదలైన ఇంటర్ రిజల్ట్స్ విద్యార్థుల పాలిట పాశాలుగా మారుతున్నాయి. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా కేసముద్రం మండలం బోడగట్ట తండాకు చెందిన గుగులోతు కృష్ణ అనే విద్యార్థి ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాకముందే ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకొన్న విషయం విదితమే. తీరా మార్కులు చూశాక అతడికి 892వ/1000 ‘ఎ’ గ్రేడ్‌తో పాస్ అయ్యాడు. కాగా.. రిజల్ట్స్ వచ్చాక రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో 7 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని మరణించారు. కాగా.. ఈ రోజు ఉదయం మరోక విద్యార్థి హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇప్పటివరకు ఇంటర్ ఫలితాల కారణంగా 9 మంది విద్యార్థులు చనిపోయారు.



Next Story