TS: విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచే ఎగ్జామ్స్

by Disha Web Desk 2 |
TS: విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచే ఎగ్జామ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నేటి (బుధవారం) నుంచి మార్చి 2 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు బ్యాచ్‌ల వారీగా వారిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాక్టికల్స్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి సందేహాలు ఉన్న తెలుసుకోవచ్చని, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. సందేహాల కొరకు 040-24600110 నంబర్‌కు కాల్ చేయాలని లేదా [email protected] కి ఇమెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచించారు.

ఇవి కూడా చదవండి : తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్



Next Story

Most Viewed