తెలుగు రాష్ట్రాల్లో మరోసారి CBI సోదాల కలకలం

by GSrikanth |   (  Updated:2022-12-29 11:34:51  IST  )

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సీబీఐ సోదాలు కలకలం రేపాయి. నకిలీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్ల స్కాంపై తమకు అందిన ఫిర్యాదులపై సీబీఐ విచారణ జరుపుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి CBI సోదాల కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సీబీఐ సోదాలు కలకలం రేపాయి. నకిలీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్ల స్కాంపై తమకు అందిన ఫిర్యాదులపై సీబీఐ విచారణ జరుపుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం వరంగల్, విజయవాడ, వైజాగ్ సహా మొత్తం దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. విదేశాల్లో చదివి స్థానికంగా నకిలీ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్లను డాక్టర్లు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వరంగల్, విజయవాడ, వైజాగ్‌లో ఈ తరహా స్కాం బయటపడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఢిల్లీ, చండీగఢ్, అమృత్‌సర్, సిమ్లా, జమ్మూ, శ్రీనగర్, డెహ్రాడూన్, ఘజియాబాద్, గౌహతి, తేజ్‌పూర్, ఇంఫాల్, సిక్కిం, రాజ్‌పూర్, విజయవాడ, వైజాగ్, వరంగల్ వంటి పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

Also Read...

తెలంగాణ ఇన్‌చార్జి డీజీపీగా అంజనీకుమార్

Next Story