తీవ్ర విషాదం.. స్టేడియం గోడ కూలి ఇద్దరు మృతి

by Disha Web Desk 2 |
తీవ్ర విషాదం.. స్టేడియం గోడ కూలి ఇద్దరు మృతి
X

దిశ, మొయినాబాద్/డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం గోడ కూలి ఇద్దరు కూలీలు మరణించారు. శిథిలాల కింద మరో 12 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుత్రికి తరలించారు. మృతులు బిహార్‌కు చెందిన బబ్లూ, వెస్ట్ బెంగాల్‌కు చెందిన సునీల్‌గా గుర్తించారు. పూర్తిస్థాయిలో శిథిలాలు తొలగించిన తర్వాత మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఎంత మంది కార్మికులు పనిలోకి వచ్చారు. వారిలో ఎంత మంది సురక్షితంగా ఉన్నారనే సమాచారాన్ని పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed