దారి మళ్లిన ఇండిగో ఫ్లైట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. సేఫ్‌గా హైదరాబాద్‌కు రాక

by Ramesh Naini |

శంషాబాద్ విమానాశ్రయం నుంచి జగదల్పూర్‌కు బయల్దేరిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది.

దారి మళ్లిన ఇండిగో ఫ్లైట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. సేఫ్‌గా హైదరాబాద్‌కు రాక
X

దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్ విమానాశ్రయం నుంచి జగదల్పూర్‌కు బయల్దేరిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి జగదల్పూర్‌కు బయల్దేరిన ఈ విమానం, గమ్యస్థానంలోని రన్‌వేపై వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అక్కడ ల్యాండింగ్ సాధ్యపడలేదు. దీంతో పైలట్లు విమానాన్ని దారి మళ్లించి రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కొంతసేపటి అనంతరం పరిస్థితులను సమీక్షించిన ఎయిర్‌లైన్ అధికారులు విమానాన్ని రాజమండ్రి నుంచి తిరిగి హైదరాబాద్‌కు పంపించారు.

ఈ విమానంలో మొత్తం 79 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనతో ప్రయాణికులు కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విమాన సిబ్బంది పరిస్థితిని సమర్థంగా నిర్వహించారు.

Next Story