- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 14 నుండి కరెంటోళ్ల నిరవధిక సమ్మె
విద్యుత్శాఖ లో మరో సారి సమ్మె హారన్మోగనుంది. ఈ నెల 14 ఉదయం 6.00 గంటల నుండి కరెంటోళ్ల నిరవధిక సమ్మెకు

ఈ నెల 14 నుండి కరెంటోళ్ల నిరవధిక సమ్మె
== సమ్మెపై స్పందించాలని డిప్యూటీ సీఎంకు వినతులు
దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్శాఖ లో మరో సారి సమ్మె హారన్మోగనుంది. ఈ నెల 14 ఉదయం 6.00 గంటల నుండి కరెంటోళ్ల నిరవధిక సమ్మెకు పూనుకోనున్నారు. ఆర్టిజన్స్ను కన్వర్షన్చేయాలని, ఒకే సంస్థ, ఒకే సర్వీస్రూల్స్అమలు డిమాండ్తో తెలంగాణ విద్యుత్ఆర్టిజన్స్కన్వర్షన్జేఏసీ ఈ మేరకు విద్యుత్శాఖ నిరవధిక సమ్మెకు పిలుపు నిచ్చింది.
ఒక వైపు కేంద్ర ప్రభుత్వం విద్యుత్సంస్థల ప్రైవైటీకరణ దిశగా పలు రాష్ట్రాలలో ముందుకు వెళుతోందని, దీనికి కొనసాగింపుగా అన్నట్లు తెలంగాణ రాష్ర్టంలోనూ ఆర్టిజన్ఉద్యోగుల సమస్యలకు ఏ మాత్రం స్పందించకుండా అధికారులను అప్రమత్తం చేస్తు ఉన్నతాధికారుల ఫోన్నెంబర్లను వినియోగదారుల చెంతకు చేరుస్తున్నారని యూనియన్సంస్థలు మండిపడుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ఆర్టిజన్ఉద్యోగుల కన్వర్షన్విషయంలో సహకారం అందించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కోరుతున్నారు.






