Telangana Elections: మేజర్ పంచాయతీలో తెలుగుదేశం అభ్యర్థి విజయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-14 16:36:47  IST  )

తెలంగాణ పల్లె పోరులో ఖమ్మం జిల్లా కామేపల్లి మేజర్ పంచాయతీలో తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు..

Telangana Elections: మేజర్ పంచాయతీలో తెలుగుదేశం అభ్యర్థి విజయం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో(Telangana Panchayat elections) టీడీపీ(Tdp) అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా(Kammam District) ఎన్నికల ఫలితాల్లో పలు పంచాయతీల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ప్రధానంగా కామేపల్లి మేజర్ పంచాయతీలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. సర్పంచ్‌గా టీడీపీ మద్దతు అజ్మీరా హరి విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు విడత ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఈ విడతలో 4332 పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 10 వరకూ మొత్తం 4100 చోట్ల ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. కాంగ్రెస్ 2126, బీఆర్ఎస్-1121, బీజేపీ-245, ఇతరులు -610 మంది అభ్యర్థులు విజయం సాధించారు.

Next Story