BJP రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను కొనసాగించడంపై క్లారిటీ

by Disha Web Desk 2 |
BJP రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను కొనసాగించడంపై క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్‌కు చివరి మేకు దింపుతున్నామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో వీధి సభలు విజయవంతంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌తో కేసీఆర్ పాలనకు చివరి మేకు దింపుతున్నట్లు ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా బండి సంజయ్‌‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించడంపైనా తరుణ్ చుగ్ క్లారిటీ ఇచ్చారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయే కొనసాగుతారని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు 2024లో ఉన్నాయి. కాగా, అప్పటి వరకు అధ్యక్షుడిని మార్చే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read..

మార్చి 15 కల్లా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉండాలి: కలెక్టర్



Next Story

Most Viewed