- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను తరిమికొట్టాలి: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
by Disha Web Desk 1 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: మతోన్మాద, రజాకార్ల పార్టీ అయిన ఎంఐఎంకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, అలాగే పాతబస్తీలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను తరిమికొట్టాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో బూత్ స్థాయి, ఆ పైస్థాయి కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీని మరోసారి గెలిపించాలంటే పోలింగ్ బూత్ నుంచే సాధ్యమవుతుందని అన్నారు. మోడీకి కుటుంబం లేదన్న వారికి తాను ఒక్కటే చెబుతున్నానని, మోడీకి దేశమంత కుటుంబం ఉందన్నారు. ఇతర నేతలు వారి కుటుంబం బాగు కోసమే చూస్తారని, కానీ మోడీ ప్రజలు బాగుండాలని కోరుకుంటారన్నారు. కేసీఆర్, కేటీఆర్ను సీఎం చేయాలని ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. రాబోయే 40 రోజులు బూత్కి పరిమితమై కష్టపడి పని చేయాలని బూత్ స్థాయి నేతలు, కార్యకర్తలను లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
Next Story