కార్యకర్తలను టచ్ చేస్తే క్రేన్‌కు వేలాడదీస్తా.. కొండా మురళి సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 4 |
కార్యకర్తలను టచ్ చేస్తే క్రేన్‌కు వేలాడదీస్తా.. కొండా మురళి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కాంగ్రెస్ లో నిన్న వర్గ విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. కొండా దంపతులు అనుచరులు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు బాహాబాహికి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొండా మురళి తాజా వివాదంపై స్పందించారు. కొత్తగా వచ్చే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఎంత మంది వచ్చినా గెలిచేది కొండా సురేఖనే అన్నారు. కార్యకర్తలను టచ్ చేస్తే క్రేన్‌కు వేలాడదీస్తా అని వార్నింగ్ ఇచ్చారు. నాలోని పాత మురళి పటేల్ బయటకు వస్తాడు అంటూ తన ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు. అయితే కొండా మురళి వ్యాఖ్యలతో వరంగల్ పాలిటిక్స్‌లో ఒక్కసారిగా మళ్లీ రాజకీయాలు వేడేక్కాయి.

Read More: పోలీసులపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు


Next Story