విధ్వంసం సృష్టిస్తే నేను బాధ్యుడిని కాదు.. పోలీసులకు రాజాసింగ్ వార్నింగ్

by Disha Web Desk 13 |
విధ్వంసం  సృష్టిస్తే నేను బాధ్యుడిని కాదు.. పోలీసులకు రాజాసింగ్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తనను పోలీసులు అరెస్ట్ చేస్తే.. హనుమాన్ భక్తులు విధ్వంసం సృష్టిస్తే అందుకు తాను బాధ్యుడిని కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ దేవాలయం నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు గురువారం నిర్వహించిన ర్యాలీకి రాజాసింగ్ ను వెళ్లనీయకుండా పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ 8వ నిజాం రజాకార్ పోలీసులను ప్రయోగించి హిందువులను అణిచివేయలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థతుల్లో హిందువులు బతకగలుగుతారా..? అని పోలీసుల తీరుపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే బండి సంజయ్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని, మరోవైపు తనను అరెస్టు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. ప్రతి సంవత్సరం ర్యాలీలో తాను పాల్గొంటున్నానని, కానీ ఇప్పుడు ర్యాలీలో పాల్గొనకుండా ముందస్తుగా అరెస్ట్ ఎందుకు చేసినట్లని రాజాసింగ్ ఫైరయ్యారు.



Next Story

Most Viewed