వీరన్నగుట్టను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం

by Taduka Kalyani |

స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ, కాలనీ సంఘాల సహకారంతో వీరన్నగుట్టను అద్భుతమైన దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఎల్బీనగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి హామీ ఇచ్చారు.

వీరన్నగుట్టను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం
X

దిశ, వనస్థలిపురం: స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ, కాలనీ సంఘాల సహకారంతో వీరన్నగుట్టను అద్భుతమైన దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఎల్బీనగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట భద్రకాళి రామలింగేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి పనులు, కాలనీల సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్​ఎస్​ యువ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 10 నుంచి 12 కాలనీల ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొని ఆలయాభివృద్ధి, మౌలిక వసతులపై అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు పూర్తయిన వెంటనే రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. వీరన్నగుట్ట క్షేత్రం ఆధ్యాత్మికంగా విశిష్ట ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రమని, గతంలో ఆలయ అభివృద్ధికి రూ.18 కోట్లు మంజూరు చేయించామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, పలువురు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.

Next Story