కొనసాగుతున్న వీధి కుక్కల వీరంగం.. జింకను చంపిన జాగిలాలు

by Dishanational1 |
కొనసాగుతున్న వీధి కుక్కల వీరంగం.. జింకను చంపిన జాగిలాలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ప్రదీప్​విషాదాంతం నేపథ్యంలో ఒకవైపు మున్సిపల్​సిబ్బంది పట్టుకుంటుండగానే బుధవారం వీధి కుక్కలు మరోసారి స్వైర విహారం చేశాయి. హైదరాబాద్, కరీంనగర్​జిల్లాల్లో చిన్నపిల్లలపై ఎగబడి తీవ్రంగా గాయపరిచాయి. చైతన్యపురం మారుతినగర్​లో నివాసముంటున్న బాలు వాచ్​మెన్​గా పని చేస్తున్నాడు. అతని నాలుగేళ్ల కుమారుడు రిషి ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. రిషి పెట్టిన కేకలు విని కుటుంబసభ్యులు, స్థానికులు పరుగున వచ్చి వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అయితే, అప్పటికే కుక్కలు రిషి తల, తొడ, వీపు భాగంలో తీవ్రంగా గాయపరిచాయి. ఇక రాజేంద్రనగర్​హైదర్​గూడలో కూడా ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. ఎర్రబోడ కాలనీలో ఇళ్ల ముందు ఆడుకుంటున్న చేతన్​(8), పునీత్​(6)లతోపాటు మరో ముగ్గురు చిన్నారులపై దాడి చేసి తీవ్ర గాయపరిచింది.

కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని ఎస్​సీ హాస్టల్​లోకి చొరబడ్డ వీధి శునకాలు 7వ తరగతి చదువుతున్న సుమంత్​రెడ్డిపై దాడిచేసి గాయపరిచాయి. వెంటనే ఆ బాలుడిని కరీంనగర్​లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే వృద్దుడు నడుచుకుంటూ పనికి వెళుతుండగా కుక్క దాడి చేసింది. తప్పించుకునే ప్రయత్నంలో కిందపడ్డ మల్లారెడ్డికి తీవ్ర గాయాలు కావటంతో హుజురాబాద్​ఆస్పత్రికి తరలించారు. సైదాపూర్​మండలం జాగిరిపల్లిలో ఎల్లమ్మ అనే వృద్ధురాలిపై కుక్క దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఇక, హైదరాబాద్​ శివార్లలోని ఫీర్జాదీగూడవ ప్రాంతంలో ఉన్న జటాయువు పార్కులోకి చొరబడ్డ జాగిలాలు ఓ జింకను కరిచి చంపాయి.

Next Story

Most Viewed