- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బహదూర్పురాలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
దిశ, చార్మినార్ : బహదూర్పురాలో సంచలనం సృష్టించిన ఓ యువకుడి హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న ఆరుగురిని బహదూర్పురా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఐదుగురి నిందితులను రిమాండ్ కు తరలించగా, మరో మైనర్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. పురాణిహవేలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సౌత్జోన్ డీసీపీ సాయిచైతన్య, ఫలక్నుమా డివిజన్ ఏసీపీ బి. యాదగిరి స్వామి తో పాటు బహదూర్పురా ఇన్స్పెక్టర్ రఘునాథ్ తో కలిసి వివరాలు వెల్లడించారు.
కిషన్బాగ్ అసద్బాబానగర్ కు చెందిన మొహమ్మద్ ఖలీల్ అలియాస్ కన్న (23) వృత్తి రీత్యా డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన కిషన్ బాగ్ అసద్బాబానగర్ కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ షబాజ్ (22), చికెన్ షాప్లో పనిచేసే షేక్ షహనావాజ్ అలియాస్ అద్దు (23), షోయబ్ ఖాన్ (30), ఏసీ టెక్నీషియన్ మొహమ్మద్ ఫారూఖ్ (20), ఆటో డ్రైవర్ సయ్యద్ అక్బర్ (29) లు మొహమ్మద్ ఖలీల్కు మంచి స్నేహితులు. ఈ నెల 15వ తేదీన రాత్రి ఎప్పటిలాగానే మొహమ్మద్ ఖలీల్తో పాటు మరో ఆరుగురు స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న మూసీ నది ఒడ్డున మద్యం సేవించారు. ఆరుగురిలో ఒకరైన మైనర్ యువకుడు షేక్ షబాజ్కు అత్యంత సన్నిహితుడు.
ఈ నేపథ్యంలోనే చిన్న విషయమై మొహమ్మద్ ఖలీల్ కు సదరు మైనర్ యువకునితో వివాదం తలెత్తింది. దీంతో ఖలీల్ మైనర్ యువకునిపై దుర్భాషలాడటం తో పాటు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఈ విషయంలో మైనర్ యువకుడిపై దాడిచేసిన ఖలీల్తో షబాజ్ గొడవకు దిగాడు. కాసేపటికే వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫకీర్ బస్తీలోని వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఖలీల్ ఉన్నాడన్న సమాచారం మేరకు తిరిగి షేక్ షబాజ్ తో పాటు షేక్ షహనవాజ్, షోయబ్ఖాన్, ఫారూఖ్లు మైనర్ యువకునితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అక్కడ పరస్పర దాడులు చేసుకుంటుండగా స్థానికులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఖలీల్ స్పృహ తప్పి కిందపోయాడన్న సమాచారం అందుకున్న అతని తండ్రితో పాటు సోదరుడు మొహమ్మద్ ఖదీర్లు అక్కడికి చేరుకున్నారు. ఇంతలోనే షబాజ్ మాత్రం తనకు అవమానంగా భావించి అతని స్నేహితులతో కలిసి అక్బర్ ఇంట్లో సమావేశమయ్యారు. ఎలాగైనా ఖలీల్ను హత్యచేస్తామని కుట్రపన్నారు. వారంతా జామ్జామ్ హోటల్ వద్దకు చేరుకున్నారు. ఖలీల్పై దాడిచేయడానికి ప్రయత్నిస్తుండగా అడ్డగించిన అతన్ని సోదరుడిని అడ్డుకున్నారు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో ఖలీల్పై విచక్షణ రహితంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.
మృతుని సోదరుడు మొహమ్మద్ ఖదీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బహదూర్ పురా పోలీసులు కేసును నమోదు చేసుకున్న అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న షేక్ షబాజ్, షేక్ షహనవాజ్, షోయబ్ ఖాన్, మొహమ్మద్ ఫారూఖ్, సయ్యద్ అక్బర్లను అరెస్ట్ చేసి గురువారం రిమాండ్కు తరలించారు. మరో మైనర్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. ఈ కేసును బహదూర్పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.