చైనా మాంజాపై పోలీసుల కొరడా

by Muthe.Rajitha |

చైనా మాంజాపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.

చైనా మాంజాపై పోలీసుల కొరడా
X

దిశ, వెబ్ డెస్క్ : చైనా మాంజాపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ జి. చంద్ర మోహన్ హెచ్చరించారు. ఈ సింథటిక్ మాంజా వల్ల మనుషుల ప్రాణాలకే కాకుండా పక్షుల జీవనానికి కూడా తీవ్రమైన ముప్పు ఏర్పడుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే మంగళహాట్ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి భారీ మొత్తంలో చైనా మాంజాను సీజ్ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని తనిఖీలు చేపట్టు కఠిన చర్యలు తీసుకుంటామని పతంగుల షాప్స్ వెండర్స్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా చైనా మాంజాను విక్రయిస్తున్నట్టు సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని, ప్రజల సహకారంతో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నివారిస్తామని అభిప్రాయపడ్డారు.

Next Story