అద్దె ఫ్లాట్‌లో పెకాట.. గుట్టురట్టు చేసిన ఎస్‌ఓటీ పోలీసులు

by Web Desk |
అద్దె ఫ్లాట్‌లో పెకాట.. గుట్టురట్టు చేసిన ఎస్‌ఓటీ పోలీసులు
X

దిశ, శేరిలింగంపల్లి : అపార్ట్మెంట్‌లో ప్లాట్ అద్దెకు తీసుకుని, రోజుకు ఆరు వేల అద్దె చెల్లించి, అందులో భారీ ఎత్తున పేకాట నిర్వహిస్తున్న వ్యక్తిని మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబర్ పేటకు చెందిన మార్కరెడ్డి గచ్చిబౌలి గ్రీన్ ల్యాండ్ కాలనీలో ఫ్లాట్ అద్దెకు తీసుకొని గత కొంతకాలంగా పేకాట నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకులతో పాటు 12 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు.

వారి వద్ద నుండి రూ.9 లక్షల నగదు, 14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బడా రైతులను లక్ష్యంగా చేసుకుని మార్కరెడ్డి ఈ పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంబర్ పేటకు చెందిన కాకర్ల మార్కరెడ్డి, అల్వాల్‌కు చెందిన పాపిరెడ్డి, ఎల్బీనగర్‌కు చెందిన కార్తీక్ గౌడ్, మెతుకు సంతోష్, సంతోష్ నగర్ కు చెందిన సతీష్, సిద్దిపేటకు చెందిన స్లీర రెడ్డి, ఓల్డ్ అల్వాల్ నివాసి వెంకట నర్సింహ రాజు, మెదక్ కు చెందిన రామయ్య, బీరంగూడ వాసి సద్గురు రెడ్డి, సంద కృష్ణ, గండిపేటకు చెందిన అప్పలరాజులను అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed