నా భద్రాద్రి రాముడు ఇక లేరు : ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కంటతడి

by Sridhar Babu |   (  Updated:2023-02-20 13:22:37  IST  )

తెలుగు చలనచిత్ర యువతరం కథానాయకులు నందమూరి తారకరత్న మరణం బాధాకరమని జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.

నా భద్రాద్రి రాముడు ఇక లేరు : ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కంటతడి
X

దిశ, జూబ్లిహిల్స్ : తెలుగు చలనచిత్ర యువతరం కథానాయకులు నందమూరి తారకరత్న మరణం బాధాకరమని జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తాను నిర్మాతగా నిర్మించిన భద్రాది రాముడు చిత్ర విశేషాల అనుబంధాన్ని, ఎన్టీఆర్ మంచితనాన్ని పుణికిపుచ్చుకున్న మనవడిగా తారకరత్న పేరు తెచ్చకున్నారని గుర్తు చేసుకున్నారు. సోమవారం ఆయన తారకరత్న భౌతికాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని వేడుకున్నారు.

ఇవి కూడా చదవండి : తన తాత ఎన్టీఆర్ అంటే తారకరత్నకు ఎంత ప్రేమో.. అందుకే అలా చేశాడంట..!

Next Story