- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను.. పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి
హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను .. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరామర్శించారు.

దిశ, వనస్థలిపురం : హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను .. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరామర్శించారు. యాక్సిడెంట్లో చనిపోయిన ముగ్గురు చంద్రసేనారెడ్డి, త్రినాథ్ రెడ్డి, వర్షిత్ రెడ్డి ఇండ్ల వద్దకు వెళ్లి మృతదేహాలకు నివాళి అర్పించారు. వారి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘కారు ఎక్కగానే చిన్నవారైనా.. పెద్దవారైనా సీటు బెల్టు ధరించాలి. ఈ ప్రమాద ఘటనలో సీటు బెల్టు పెట్టుకున్న యువకుడు ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగతా ముగ్గురు చనిపోయారు. యువకులు ఎవరైనా ఓవర్స్పీడ్తో డ్రైవింగ్చేసే ముందు ఇంటివద్ద ఉన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలి. వేగాన్ని నియంత్రించుకోవాలి’ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చొద్దు . రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా’ అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రి వెంకట్రెడ్డి తో పాటు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్కార్పొరేషన్చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ నాయకులు సుప్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు.






