ఎల్బీనగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి: Koonanneni

by Disha Web Desk 16 |
ఎల్బీనగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి: Koonanneni
X

దిశ , తెలంగాణ బ్యూరో‌: గిరిజన మహిళను అకారణంగా కొట్టిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. బాధిత మహిళను అయన పరామర్శించారు. పోలీసుల దాడిపై లక్ష్మిని అడిగి తెలుసుకున్నారు . అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏ తప్పు చేశారని గిరిజన మహిళను అరెస్టు చేశారని ప్రశ్నించారు.


బాధిత మహిళా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూం ఇల్లు, పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భరించాలని సూచించారు. పేద మహిళలకు భరోసా ఇవ్వకుంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు విలువ ఉండదన్నారు. పోలీసులపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూనంనేని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed