డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా.. కొడుకు ఓ మహిళతో కలిసి తల్లిదండ్రులనే..

by Disha Web Desk 11 |
డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా.. కొడుకు ఓ మహిళతో కలిసి తల్లిదండ్రులనే..
X

దిశ, మియాపూర్: డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులనే మోసం చేసేందుకు కొడుకు ఓ మహిళతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడిన సంఘటన మియాపూర్ పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

డీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంజీవరావు కుటుంబం మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి కంకి పవన్ కుమార్ (25) కుమారుడు ఉన్నాడు. పవన్ కుమార్ బీటెక్ చదువుతున్నాడు. శనివారం కాలేజీకి వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఇరుగు పొరుగును విచారించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు విచారణలో ఉండగానే ఆదివారం గుర్తు తెలియని మహిళ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్‌లో ఆమె రూ. 50 వేలు ఇస్తేనే పవన్ ను విడిచిపెడతామని లేకుంటే చంపేస్తామని బెదిరించింది. పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. డీఐ కాంతారెడ్డి నేతృత్వంలోని మియాపూర్ పోలీసులు మహిళ (45), పవన్ ను కేవలం 6 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. తప్పిపోయిన వ్యక్తి రాధిక అనే మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు . ఈ క్రమంలోనే కిడ్నాప్ డ్రామా ఆడి అతని తల్లిదండ్రుల నుంచి డబ్బు రాబట్టేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తెలిసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed