ఏపీ లిక్కర్ రవాణా కేసు.. ఈడీ కస్టడీకి అనుమతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-15 15:27:39  IST  )

ఏపీ లిక్కర్ రవాణా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితులను ఈడీ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ..

ఏపీ లిక్కర్ రవాణా కేసు.. ఈడీ కస్టడీకి అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ రవాణా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితులను ఈడీ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. గురువారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు నిందితులను విచారించనున్నారు. నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్‌కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌ను ఈడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. మద్యం అక్రమ రవాణా, నిధుల మళ్లింపు, ఈ వ్యవహారంలో ఇతర భాగస్వాములకు ఉన్న సంబంధాలపై అధికారులు విచారించనున్నారు. ఈ త్రిసభ్య నిందితుల బృందాన్ని సుదీర్ఘంగా ప్రశ్నించడం ద్వారా ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, ఇతర కీలక లావాదేవీలకు సంబంధించి మరిన్ని ఆధారాలను బయటకు తీయవచ్చని ఈడీ అధికారులు భావిస్తున్నారు.

Next Story