KCR : సాయి చందుకు కేసీఆర్ నివాళి

by Disha Web Desk 15 |
KCR : సాయి చందుకు కేసీఆర్ నివాళి
X

దిశ, వనస్థలిపురం : గాయకుడు సాయిచంద్​కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సాయిచంద్ దశదిన కర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కళాకారులు సాయి చందును గుర్తు చేసుకుంటూ పాటలు పాడారు.

Next Story

Most Viewed