- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సౌత్ జోన్ డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారిణి స్నేహ మెహ్రా
దిశ, చార్మినార్ : దక్షిణ మండలం డీసీపీ గా ఉత్తరాఖండ్ వాస్తవ్యురాలు 2018 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిణి స్నేహ మెహ్రా శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇప్పటి వరకు సౌత్ జోన్ డీసీపీలుగా నియమితులైన వారిలో తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా స్నేహ మెహ్రా రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఇక్కడ డీసీపీ గా విధులు నిర్వహించిన సాయి చైతన్య డీజీపీ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు.
సౌత్జోన్ డీసీపీ సాయి చైతన్య మజ్లిస్ పార్టీకీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలించిన ఎన్నికల సంఘం సాయిచైతన్యను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముక్కుసూటి స్వభావి అయిన ఉత్తరఖాండ్ కు చెందిన స్నేహ నెహ్రా 2018లో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ అధికారిణి స్నేహ నెహ్రా సైబర్ నేరాల విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందారు.
పాతబస్తీ మక్కా మసీదు ను సందర్శించిన సౌత్జోన్ డీసీపీ స్నేహ నెహ్రా..
దక్షిణమండలం డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్నేహ మెహ్రా అడిషనల్ డీసీపీ షేక్ జహంగీర్తో కలిసి శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు సందర్భంగా పాతబస్తీలోని చారిత్రాత్మక చార్మినార్, మక్కా మసీద్ ప్రాంతాలను సందర్శించి, అక్కడి పోలీస్ బందోబస్తును పరిశీలించారు.