- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘విరూపాక్ష’ లో మొదట నన్నే హీరోగా అనుకున్నారు.. బిగ్ బాస్ ఫెమ్ అర్జున్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్, యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ జంటగా నటించిన సినిమా ‘విరూపాక్ష’. దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్ను అందుకుంది. కేవలం రూ. 65 కోట్ల బడ్జెట్తో రూపొందిన ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్దా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అంతే కాకుండా చాలా గ్యాప్ తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అలాంటి ఈ మూవీలో మొదట హీరోగా సాయి ధరమ్ తేజ్ను కాకుండా బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ను అనుకున్నారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అర్జున్ తెలిపాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చేసేందుకు నేను డైరెక్టర్ కార్తీక్ ప్రోడ్యూసర్ కోసం రెండు సంవత్సరాలు తిరిగాము. కానీ ఫస్ట్ మేము ‘శాసనం’ అని పేరు అనుకున్నాం. అప్పట్లో కొత్త వాళ్ల మీద అంత ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా అనుకుని ఏ ప్రోడ్యూసర్ ముందుకు రాలేదు. తర్వాత ఇక సాయి ధరమ్ తేజ్తో ‘విరూపాక్ష’ గా తెరకెక్కించారు’ అంటూ చెప్పుకొచ్చాడు అర్జున్. ప్రస్తుతం అర్జున్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘నువ్వు ఈ సినిమా చేసుంటే ‘శాసనం’ కాదు నాశనం అయ్యేది’, ‘యాక్ట్ చెయ్యకుండా మంచి పని చేశావు’, ‘నువ్వు హీరోగా తీస్తే సినిమా కూడా నువ్వే చూసుకోవాల్సి వచ్చేది’ అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.