- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఐదుగురు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి
కరీంనగర్ లో బంగారం దుకాణంలో ఆదివారం దోపీడీకి పాల్పడ్డ దొంగల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. కాల్పులకు తెగపడి దోపిడీకి పాల్పడ్డ ఐదుగురు వ్యక్తుల సమాచారం ఇస్తే లక్ష రూపాయాల బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించారు

దిశ, సిటీక్రైం : కరీంనగర్ లో బంగారం దుకాణంలో ఆదివారం దోపీడీకి పాల్పడ్డ దొంగల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. కాల్పులకు తెగపడి దోపిడీకి పాల్పడ్డ ఐదుగురు వ్యక్తుల సమాచారం ఇస్తే లక్ష రూపాయాల బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ దోపీడీ దొంగల ఫోటోలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లకు పంపించారు. అలాగే వాటిని వాట్సాప్ లలో పోలీసులు పౌరులకు షేర్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ దొంగలను పట్టుకునేందుకు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీసులు కూడా అప్రమత్తమై దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం ఉంటే డయల్ 100 , కరీనగర్ 2 టౌన్ ఇన్ స్పెక్టర్ 8712670762, ఏసీపీ కరీంనగర్ టౌన్ 8712670711, ఎస్బీ కంట్రోల్ కరీంనగర్ 8712670713 తెలపాలని పోలీసులు కోరుతున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.






