రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన అదనపు కలెక్టర్

by Disha Web Desk 13 |
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా  ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన అదనపు కలెక్టర్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. "భారత దేశ ప్రజలమైన మేము దేశంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నెలకొల్పుకునేందుకు, పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావప్రకటన, స్వేచ్ఛ, సమానత్వం, జాతి ఐక్యతకు, వ్యక్తి గౌరవానికి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మనకు మనంగా రూపొందించుకున్న భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న అంగీకరించుకుని అది శాసనం చేసుకున్నామని, ఇందుకు కట్టుబడి ఉంటామని సత్యనిష్ట పూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లు" అని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలత, ల్యాండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సంతోషి, కలెక్టరేట్ కార్యాలయ విభాగాల అధిపతులు, సిబ్బంది, తదితరులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

Next Story

Most Viewed