కాంగ్రెస్ అభ్యర్ధి రంజిత్ రెడ్డికి మద్దతుగా ఆయన తనయుడి ఆర్యన్ రెడ్డి ప్రచారం

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ అభ్యర్ధి రంజిత్ రెడ్డికి మద్దతుగా ఆయన తనయుడి ఆర్యన్ రెడ్డి ప్రచారం
X

దిశ, శేరిలింగంపల్లి : రానున్న ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో హస్తం గుర్తుకు ఓటు వేసి మా నాన్న రంజిత్ రెడ్డిని గెలిపించాలని ఆయన తనయుడు ఆర్యన్ రెడ్డి ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి మియాపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందజేసి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇలియాస్ షరీఫ్, వీరేందర్ గౌడ్, డివిజన్ నాయకులు, మహిళలు, యువకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed