విద్యుత్ సౌదా వద్ద తీవ్ర ఉద్రిక్త.. రోడ్లపై బైఠాయించిన ఉద్యోగులు

by Disha Web Desk 7 |
విద్యుత్ సౌదా వద్ద తీవ్ర ఉద్రిక్త.. రోడ్లపై బైఠాయించిన ఉద్యోగులు
X

దిశ, ఖైరతాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో విద్యుత్ సౌధ దద్దరిల్లింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన 'ఛలో విద్యుత్ సౌధ' పిలుపు మేరకు శుక్రవారం ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లపై బైఠాయించి ధర్నా చేశారు. స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేయాలని, వేతన సవరణ-2022, ఆర్టిజన్ సమస్యలు ఈపీఎఫ్ స్థానంలో జీపీఎఫ్ (1999- 2004) అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో ఖైరతాబాద్ ప్రాంతంలో 2గంటలకు పైగా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగుల ధర్నాకు పలు సంఘాలు, రాజ పార్టీలు మద్దతు తెలిపాయి.


Next Story

Most Viewed