గుడ్ న్యూస్: రాష్ట్రంలో పెరిగిన భూగర్భ జలాలు

by Vemula.Srinu Prasad |

తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి..

గుడ్ న్యూస్: రాష్ట్రంలో పెరిగిన భూగర్భ జలాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది భూగర్భజలాలు పెరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల ఏడాది మే నెలలో భూగర్భజలాలు రాష్ట్రవ్యాప్తంగా అధికంగా నమోదు అయినట్లు తెలిపారు. కొంతకాలంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న నేపథ్యంలో భూగర్భజలాలు పెరిగినట్లు చెప్పారు. ఆగస్టు నెలలో 574 మి.మిలకు గాను 721 మి.మిగా నమోదు అయినట్లు పేర్కొన్నారు. ఇది సాధారణ వర్ష పాతం కంటే 26% ఎక్కువగా నమోదు అయిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Next Story