- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి పీఏలమంటూ.. అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు : మంత్రి పొంగులేటి
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ ( పీఏ) ల మని చెప్పి ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం నాగోల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..

దిశ, వనస్థలిపురం: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ ( పీఏ) ల మని చెప్పి ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం నాగోల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి ( 34), మచ్చ సురేశ్( 30) నాగోల్లో నివాసముంటున్నారు. వీరు మంత్రి పీఏలమంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫోన్లు చేసి పైరవీలు, వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ జరిపిన పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఇక నుంచి తన పీఏలమంటూ ఎవరైనా ఫోన్ చేస్తే, ఎలాంటి చిన్న అనుమానం కలిగినా సెక్రటేరియట్లో తన కార్యాలయం 040-23451072 / 040-23451073 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






