జనాభా లెక్కల స్వీయ గణన ప్రతి ఒక్కరు చేసుకోవాలి : కలెక్టర్ ప్రియాంక ఆల

by Ratna Kumari |

జనాభా లెక్కలలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల విజ్ఞప్తి చేశారు.

జనాభా లెక్కల స్వీయ గణన ప్రతి  ఒక్కరు చేసుకోవాలి :   కలెక్టర్  ప్రియాంక ఆల
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : జనాభా లెక్కలలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె మాట్లాడుతూ దేశ జనాభా లెక్కలు 2027 కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 2026 ఏప్రిల్ 26 నుంచి స్వీయ గణన అధికారికంగా ప్రారంభమైందని, ఈ నెల 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. దేశ అభివృద్ధిలో జనాభా లెక్కలకు అత్యధిక ప్రాముఖ్యత ఉంటుందని, అన్ని రంగాలలో ఉన్నటువంటి జిల్లా ప్రజలు, ఉద్యోగులు ఈ ప్రక్రియలో పాల్గొని ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలన్నారు. అధికారిక వెబ్‌సైట్ https://se.census.gov.inలో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సుపరిపాలన, సమానాభివృద్ధికి జనాభా లెక్కలు అత్యవసరమని, స్వీయ గణన సమగ్ర సమాచార సేకరణకు బలమైన పునాదిగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

Next Story