విశాఖ రాజధాని అబాసుపాలు: Narayana

by Disha Web Desk 16 |
విశాఖ రాజధాని అబాసుపాలు: Narayana
X

దిశ, తెలంగాణ బ్యూరో: విశాఖపట్నం రాజధాని అనే మాట ఆబాస్ పాలు అయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం కేంద్రంగా గంజాయి, బెట్టింగ్ దందా మొదలైందని తెలిపారు. ఈ దందా పరాకాష్టకు చేరి ఒక అనామకుడి దగ్గర 350 కోట్ల రూపాయల దొరికాయంటే అలాంటి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయో తెలవదని పేర్కొన్నారు. బెట్టింగ్ ముఠా, గంజాయి ముఠా అధికార పార్టీ నాయకుల అండదండలు లేకుండా జరగవని అన్నారు. విజయవాడ కేంద్రంగా వారిని కాపాడడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ కేంద్రంగా ఎమ్మెల్యేలు ముఖ్య నాయకుల సహకారంతోనే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేవలం రాష్ట్ర ప్రభుత్వమే విచారణ జరిపించలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈడి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వంలో విశాఖపట్నం వైసిపి ప్రభుత్వం వచ్చాక మద్యం మాఫియాగా మారిపోయిందని, భూతందాలకు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు.ఈ ఘటనలపై ఈడి, సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నారాయణ డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed