మాస్క్ ధరించని వారిపై ఒక్కరోజే 100 కేసులు

by Web Desk |
మాస్క్ ధరించని వారిపై ఒక్కరోజే 100 కేసులు
X

దిశ, ముషీరాబాద్: హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మాస్క్ ధరించని వారిపై సోమవారం ఒక్కరోజే 100 కేసులు నమోదు అయ్యాయి. చిక్కడపల్లి సీఐ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్, సుందరయ్య పార్క్, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పాన్ షాప్స్, హోటల్స్, టీ స్టాల్స్ తదితర కౌంటర్లలో వుండి మాస్కులు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ డ్రైవ్ ప్రతిరోజూ కొనసాగుతుందన్నారు. దుకాణాల యాజమాన్యాలు, వాటిలో పనిచేసే ఉద్యోగులు తప్పకుండా మాస్కులు ధరిస్తూ, కరోనా నిబంధనలను పాటించాలన్నారు. కస్టమర్స్‌ని సోషల్ డిస్టెన్స్‌లో ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. నో మాస్క్ - నో ఎంట్రీ అని బోర్డులు చేయాలని ఆదేశించారు.


Next Story