ట్రైబల్ ​వెల్ఫేర్​ హాస్టల్​లో దారుణం.. ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య

by Ramesh Goud |

హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని .. కుంట్లూరు తెలంగాణ ట్రైబల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ జూనియర్​ కాలేజీ గర్ల్స్​హాస్టల్​లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

ట్రైబల్ ​వెల్ఫేర్​ హాస్టల్​లో దారుణం.. ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, వనస్థలిపురం: హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని .. కుంట్లూరు తెలంగాణ ట్రైబల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ జూనియర్​ కాలేజీ గర్ల్స్​హాస్టల్​లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్​ కర్నూల్ ​జిల్లా.. కొండనాగుల మండలం.. అంబగిరి గ్రామానికి చెందిన ఉడత నూరి శివశంకర్​ కుమార్తె సౌమ్య(17) ఇంటర్ ​సెకండియర్​ చదువుతోంది. సాయంత్రం 7 గంటల సమయంలో తోటి విద్యార్థినిలు డిన్నర్​ చేసేందుకు వెళ్లగా తరగతిదిలోకి వెళ్లి తన చున్నీతో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థిని కాలేజీ హాస్టల్​ ప్రిన్సిపాల్​ కమ్​ వార్డెన్​ విజయలక్ష్మి సమాచారం ఇచ్చేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో వెంటనే కిందికి దించింది. అనంతరం ప్రిన్సిపాల్​, వార్డెన్ విజయలక్ష్మికి సమాచారం ఇవ్వడంతో వచ్చి దగ్గరలోని ఓ ప్రైవేట్​ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డెడ్​బాడీనీ పోస్ట్​మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజుగౌడ్ ​తెలిపారు.

గతంలోనూ ఆత్మహత్యాయత్నం

ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థిని సౌమ్య నోట్​బుక్​లను పరిశీలిస్తే.. ప్రేమకు సంబంధించిన విషయాలు రాసుకున్నట్లు గుర్తించారు. గతంలోనూ ఇదే హాస్టల్​లో ఆత్మహత్యకు యత్నించగా, కాపాడినట్లు, అనంతరం ప్రిన్సిపాల్​ తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో మందలించి లెటర్​రాయించుకున్నారని చెప్తున్నారు.

Next Story