KTR ప్రోగ్రాంలో అదనపు కలెక్టర్‌కు తీవ్ర అవమానం

by Disha Web Desk |
KTR ప్రోగ్రాంలో అదనపు కలెక్టర్‌కు తీవ్ర అవమానం
X

దిశ, కూకట్ పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ.28 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. కాగా, కేటీఆర్ పాల్గొన్న అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య కు చేదు అనుభవం ఎదురైంది. తను అదనపు కలెక్టర్ అని చెప్పిన పోలీసులు ఆయనను ఇండోర్ స్టేడియం లోనికి అనుమతించలేదు. దీంతో అదనపు కలెక్టర్ అభిషేక్ వెనుతిరిగారు.




Next Story

Most Viewed