బ్రేకింగ్: పాకిస్థాన్ బోర్డర్‌లో హైదరాబాద్ వాసి అరెస్ట్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: పాకిస్థాన్ బోర్డర్‌లో హైదరాబాద్ వాసి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ సరిహద్దులో హైదరాబాద్ వాసి అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌లోని మీర్ చౌక్ నుండి పాకిస్థాన్ వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని హైమద్ అలీగా పోలీసులు గుర్తించారు. దొంగ పాస్ పోర్టుతో హైదరాబాద్‌లోని పాతబస్తీ నుండి పాకిస్థాన్ వెళ్తున్న హైమద్ అలీని రాజస్థాన్ సరిహద్దులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దొంగ పాస్ పోర్టుతో హైమద్ అలీ పాకిస్థాన్ వెళ్లేందుకు యత్నించాడని పోలీసులు వెల్లడించారు. 2021 నుండి హైమద్ అలీ హైదరాబాద్‌లోనే ఉంటున్నాడని పేర్కొన్నారు. హైమద్ అలీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. అతడు పాకిస్థాన్ ఎందుకు వెళ్తున్నాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story