- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు షాకిచ్చిన మెట్రో.. ప్రయాణవేళల్లో కీలక మార్పులు
మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) షాకింగ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్డెస్క్: మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై వారంలో అన్నిరోజులూ ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు సర్వీసులు (Metro Rail Service) ప్రారంభమవుతాయని, రాత్రి 11 గంటల వరకూ అన్ని టెర్మినల్స్ లో రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది. నవంబర్ 3వ తేదీ నుంచి ఈ ప్రయాణవేళలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇప్పటి వరకూ సోమవారం నుంచి శుక్రవారం మెట్రో రైళ్లు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యేవి. లాస్ట్ మెట్రో రైలు 11.45కి ఉండేది. ఈ సౌకర్యం అర్థరాత్రి వరకూ పనిచేసే ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడింది. ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయిస్ సేఫ్ గా తమ గమ్యస్థానాలకు చేరారు. శనివారం ఫస్ట్ మెట్రో ఉదయం 6 గంటలకు, లాస్ట్ మెట్రో 11 గంటలకు ఉండేది. ఆదివారం ఉదయం 7 గంటలకు ఫస్ట్ మెట్రో, 11 గంటలకు లాస్ట్ మెట్రో ఉండేది.
కానీ నవంబర్ 3వ తేదీ నుంచి అన్ని రోజుల్లోనూ ఉదయం 6 గంటలకు మెట్రో ప్రారంభమవనుండగా.. ఆఖరి మెట్రో 11 గంటలకు ఉండనుంది. దీనివల్ల అర్థరాత్రి వరకూ ఆఫీసుల్లో పనిచేసి, మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకునే ఉద్యోగులకు మళ్లీ ప్రయాణకష్టాలు తప్పేలా లేవు.






