HYD : వరుస అగ్ని ప్రమాదాలు.. వ్యాపారస్తులకు తలసాని సీరియస్ వార్నింగ్!

by Sathputhe Rajesh |   (  Updated:2023-02-02 06:09:12  IST  )

హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాద ఘటనలపై మంత్రి తలసాని శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.

HYD : వరుస అగ్ని ప్రమాదాలు.. వ్యాపారస్తులకు తలసాని సీరియస్ వార్నింగ్!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాద ఘటనలపై మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. చిక్కడపల్లి వద్ద జరిగిన అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనను ఆయన పరిశీలించారు. హైదరాబాద్‌లో గోడౌన్‌లు రన్ చేసే వ్యాపారస్తులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపులు తీసేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపారస్తుల కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. ఇకపై నిబంధనలు పాటించని వ్యాపారస్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. .

Also Read...

కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్!

Next Story