HYD : పంజా విసిరిన సైబర్ క్రిమినల్స్.. రూ.7.5 లక్షల ఫ్రాడ్

by Disha Web Desk 4 |
HYD : పంజా విసిరిన సైబర్ క్రిమినల్స్.. రూ.7.5 లక్షల ఫ్రాడ్
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. నకిలీ ఈ మెయిల్ సృష్టించి ఓ కంపెనీకి రూ.ఏడున్నర లక్షల మేర కుచ్చు టోపీ పెట్టారు. బాగ్ అంబర్ పేట్‌లో ఉన్న ఏబీఆర్ ఆర్గానిక్ సంస్థ చైనా దేశానికి చెందిన ఓ కంపెనీతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకునేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రెండు కంపెనీలు ఈ మెయిల్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నాయి.

కాగా, చైనా కంపెనీకి చెందిన ఈ మెయిల్‌కు నకిలీ మెయిల్ సృష్టించిన సైబర్ మోసగాళ్లు బ్యాంక్ అకౌంట్ మారిందంటూ రెండు రోజుల క్రితం మెయిల్ పంపారు. ఆ అకౌంట్‌లో డబ్బు జమ చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఏబీఆర్ సంస్థ ప్రతినిధులు ఆ అకౌంట్‌లో ఏడున్నర లక్షలు జమ చేసారు. ఆ తరువాత మోసపోయినట్టు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.


Next Story