- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: తెలంగాణ ఓటర్లకు భారీ గుడ్ న్యూస్.. పోలింగ్ టైమ్ పెంచిన ఈసీ
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో పోలింగ్కు మరో 12 రోజుల సమయం మాత్రం ఉన్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్టు తాజాగా ఈసీ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో ఎండలు దంచికొట్టడంతో పోలింగ్ శాతంపై ప్రభావం చూపుతుందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని పెంచాలని ఈసీకి విజ్ఞప్తులు వచ్చాయి. రాష్ట్రం నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు ఈసీ తాజాగా ప్రకటించింది. ఇక, ఈ ఏడాది దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. మే 13వ తేదీన నాలుగో దశలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Next Story