భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి

by Disha Web Desk 2 |
భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భయంకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఇన్‌స్పెక్టర్‌ సహా ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లకు గాయాలు అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనాస్థలం నంచి ఆయుధాలు మందుగుండి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story