వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో

by Prasad Jukanti |   (  Updated:2026-03-18 12:19:04  IST  )

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది.

వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూములపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో విధించింది. భూదాన్ భూములపై యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. నష్టపోయిన బాధితులందరికీ ఇండ్లు మంజూరు చేయాలని భూదాన్ భూముల బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. కేవలం 311 మంది మాత్రమే కాదు, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇవ్వాలని ఆదేశించింది. స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ ను ఆదేశించింది.

Next Story